రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ABN , First Publish Date - 2023-06-02T23:57:48+05:30 IST

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుదురుమళ్ల, నందారం, దౌల్తాబాద్‌, బిచ్చాల్‌, బాలంపేట్‌ గ్రామాల్లో శుక్రవారం రైతు వేదికలను ప్రారంభించారు.

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
దౌల్తాబాద్‌: రైతు వేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

దౌల్తాబాద్‌, జూన్‌ 2: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుదురుమళ్ల, నందారం, దౌల్తాబాద్‌, బిచ్చాల్‌, బాలంపేట్‌ గ్రామాల్లో శుక్రవారం రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలందరికీ కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రైతులకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా అండగా నిలిచారన్నారు. దేశంలోనే మొదటిసారిగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అదేవిధంగా కుదురుమళ్ల గ్రామంలో హనుమాన్‌ దేవాలయం నిర్మాణం కోసం రూ.1లక్ష ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:57:48+05:30 IST