పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు
ABN , First Publish Date - 2023-03-30T23:26:30+05:30 IST
కొడంగల్లోని నవీన ఆదర్శ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
కొడంగల్, మార్చి 30: కొడంగల్లోని నవీన ఆదర్శ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డీవి.నరేశ్రాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు డి.వెంకటయ్య, మోటివేషనల్ వక్త కృష్ణస్వామి, రిటైర్డ్ హెచ్ఎం రాములు, రాధాకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ సంతోష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.