వైభవంగా ఎల్లమ్మదేవి బోనాలు
ABN , First Publish Date - 2023-06-02T23:50:59+05:30 IST
మండలంలోని కామునిపల్లిలో శుక్రవారం ఎల్లమ్మదేవి బోనాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే గ్రామస్థులు ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
కులకచర్ల, జూన్ 2: మండలంలోని కామునిపల్లిలో శుక్రవారం ఎల్లమ్మదేవి బోనాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే గ్రామస్థులు ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. సాయంత్రం మహిళలు బోనాలతో ఊరేగింపుగా గ్రామం నుంచి ఎల్లమ్మతల్లి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ చందనబాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.