ఐఎన్ఐ-ఎస్ఎస్లో మెరిసిన డాక్టర్ సాయిజీవన్
ABN , First Publish Date - 2023-05-31T23:43:32+05:30 IST
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన యువకుడు డాక్టర్ పెండ్యాల సాయిజీవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్-సూపర్ స్పెషాలిటీ అర్హత పరీక్షలో ఆల్ ఇండియా 14వ ర్యాంక్ సాధించాడు.
షాద్నగర్ అర్బన్, మే 31: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన యువకుడు డాక్టర్ పెండ్యాల సాయిజీవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్-సూపర్ స్పెషాలిటీ అర్హత పరీక్షలో ఆల్ ఇండియా 14వ ర్యాంక్ సాధించాడు. ఇంజినీర్ పెండ్యాల జగదీశ్వర్, ఉపాధ్యాయురాలు నీరజ కుమారుడైన సాయిజీవన్ అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి విద్యా సంస్థలో ప్రాథమిక విద్య, హైదరాబాద్లోని సత్యసాయి విద్యా సంస్థలోనే ఇంటర్ చదవారు. మెడికల్ ఎంట్రె న్స్లో ఆల్ ఇండియా 92వ ర్యాంక్ సాధించి పాండిచ్చేరిలోని జిప్మర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీ ఆల్ ఇండియా అర్హత పరీక్షలో 171వ ర్యాంక్ సాధించి చండీఘర్లో డీఎం చదువుతూ సూపర్ స్పెషాలిటీ అర్హత పరీక్ష రాశారు. క్రిటికల్ కేర్ విభాగంలో ఆల్ ఇండియా 14వ ర్యాంక్ సాధించిన సాయిజీవన్కు ఏఐఐఎంఎస్ వంటి ప్రతిష్టాత్మక కళాశాలలో డీఎం(డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్) కు అవకాశం పొందారు.