ఆలయాల నిర్మాణానికి దాతల విరాళం
ABN , First Publish Date - 2023-03-05T00:14:47+05:30 IST
ఆలయ నిర్మాణానికి స్థానిక ఎంపీపీ మధుసూదన్రెడ్డి రూ.10లక్షలు విరాళంగా అందజేసి ఉదారతను చాటుకున్నాడు.
కొత్తూర్/శంకర్పల్లి, మార్చి 4 : ఆలయ నిర్మాణానికి స్థానిక ఎంపీపీ మధుసూదన్రెడ్డి రూ.10లక్షలు విరాళంగా అందజేసి ఉదారతను చాటుకున్నాడు. కొత్తూర్ మండలం గుడూర్లో నిర్మిస్తున్న శ్రీవిశాలాక్షి సమేత శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నారు. ఎంపీపీ రూ.10లక్షలు అందజేసినట్లు తెలిపారు. దేవాలయ కమిటీ సభ్యులు ఎంపీపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సుభిషి డెవలపర్స్ యాజమాని రూ.10 లక్షల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో శంకర్పల్లి మాజీ సర్పంచ్ సాత ఆత్మలింగం, సాత ప్రవీణ్కుమార్, మోహన్, పాండురంగారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.