తూకంలో ఎక్కువ ధాన్యం తరుగు తీయొద్దు
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:23 PM
రైతుల వద్ద తూకంలో ఎక్కువ ధాన్యం తరుగు తీయొద్దని ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు.
పెద్దేముల్, డిసెంబరు 14: రైతుల వద్ద తూకంలో ఎక్కువ ధాన్యం తరుగు తీయొద్దని ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. మండల ంలోని మంబాపూర్, మన్సాన్పల్లి గ్రామాల్లో గురువారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అక్కడ ధాన్యం తూకం వేస్తున్న విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. మన్సాన్పల్లి నుంచి మంబాపూర్ వరకు రైతులు ధాన్యం తీసుకురావడానికి శ్రమతోపాటు అధికవ్యయం అవుతుందని రైతుల కోరిక మేరకు మన్సాన్పల్లిలోనే ధాన్యం తూకం వేయించారు. ఆర్డీవో వెంట తహశీల్దారు కిషన్, ఆర్ఐ.రాజిరెడ్డి ఉన్నారు.