మైనింగ్ జోన్ ఏర్పాటు చేయవద్దు
ABN , First Publish Date - 2023-05-31T23:44:20+05:30 IST
యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళనకు దిగారు. క్వారీ ఏర్పాటుకు జరుగుతున్న పనులను బుధవారం 30మంది రైతులు అడ్డుకున్నారు.
పనులను అడ్డుకున్న రైతులు.. నిర్వాహకులతో వాదన
యాచారం. మే 31 : యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళనకు దిగారు. క్వారీ ఏర్పాటుకు జరుగుతున్న పనులను బుధవారం 30మంది రైతులు అడ్డుకున్నారు. నిర్వాహకుడు శ్రీనివా్సతో వాదనకు దిగారు. తమకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులున్నాయని. మైనింగ్ జోన్ కింద పనులు చేసుకుంటామని నిర్వాహకుడు మొండికేశారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక్కడ క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేస్తే వ్యవసాయరంగం కుంటుపడుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు యాచారం పోలీసులకు సమాచారమందించారు. కాగా, ఇరువర్గాల వారిని సీఐ లింగయ్య పోలీస్ స్టేషన్కు రప్పించి మాట్లాడారు. రైతుల అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేయరాదని నిర్వాహకులకు చెప్పి పంపించారు.