నృసింహుడి సన్నిధిలో జిల్లా జడ్జి
ABN , First Publish Date - 2023-01-15T00:12:10+05:30 IST
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సీహెచ్కే.భూపతి కుటుంబ సభ్యులు శనివారం దర్శి ంచుకున్నారు.
ధర్మపురి, జనవరి 14: జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సీహెచ్కే.భూపతి కుటుంబ సభ్యులు శనివారం దర్శి ంచుకున్నారు. సంప్రదాయం ప్రకారం మంగళవాయిద్యాల మధ్య వారికి స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో జడ్జి పూజలు జరిపారు. సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్ వారికి స్వామి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం బహుకరించారు. అంతకు ముందుయమధర్మరాజు ఆలయం వద్ద గండ దీపంలో నూనెపోసి జడ్జి కుటుంబం మొక్కుకుంది. ఇతర ఆలయాలనూ సందర్శించారు.