9న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2023-06-02T23:54:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న నిర్వహించే సంక్షేమ దినోత్సవం రోజు లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి మండలాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలకు లేఅవుట్‌లు చేసి పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.

9న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న నిర్వహించే సంక్షేమ దినోత్సవం రోజు లబ్ధిదారులకు పట్టాల పంపిణీకి మండలాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలకు లేఅవుట్‌లు చేసి పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను సర్వేయర్లతో కొలతలు చేయించి లేఅవుట్‌ చేసి ప్లాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ ప్లాట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రిజర్వేషన్‌ నిబంధనలు పాటిస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశశోక్‌ కుమార్‌, వికారాబాద్‌ ఆర్డీవో విజయ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్స్‌ ఏడీ రామ్‌ రెడ్డి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:54:00+05:30 IST