జాతరలో మజ్జిగ పంపిణీ
ABN , First Publish Date - 2023-03-30T23:27:48+05:30 IST
జాతరలో భక్తులకు మైనార్టీ నాయకులు మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు.
కొడంగల్, మార్చి 30: జాతరలో భక్తులకు మైనార్టీ నాయకులు మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం జుంటుపల్లిలో జరిగిన జాతర ఉత్సవాలు, సీతారాముల కళ్యాణ మహోత్సవంలో యాలాల మండలంలోని బండమీదిపల్లి శివారులో గల సుఫీ జలాల్ బాబా దర్గా కమిటీ నిర్వాహకులు గౌస్ బాబా, కొడంగల్ మాజీ ఉప సర్పంచ్, మైనార్టీ నాయకులు ఎస్ఎం.గౌసన్ భక్తులకు మజ్జిగ, తాగునీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.