బీఆర్ఎ్సతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-06-11T00:04:41+05:30 IST
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.
కేశంపేట, జూన్ 10: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఎక్లా్సఖాన్పేటలో గల ఎమ్మెల్యే నివాసంలో కొండారెడ్డిపల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎ్సలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్పంతులు, దశరథ్, రాములు, రామోజీ, వెంకటేష్, శ్రీను, ఉడిత్యాల వెంకటేష్, వెంకటేశ్వర రావు, భాస్కర్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చింతకుంటపల్లి గ్రామంలోని నూతన దేవాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.