టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-03-26T00:04:53+05:30 IST

టీడీపీ పాలనలోనే బడుగు, బలహీనవర్గాలతో పాటు మైనారిటీలు అభివృద్ధి చెందారని టీటీడీపీ మాజీ అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలిపారు.

టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి

మొయినాబాద్‌ రూరల్‌/షాబాద్‌, మార్చి 25 : టీడీపీ పాలనలోనే బడుగు, బలహీనవర్గాలతో పాటు మైనారిటీలు అభివృద్ధి చెందారని టీటీడీపీ మాజీ అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలిపారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని హిమయత్‌నగర్‌ గ్రామంలో ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి, సీనియర్‌ నాయకుడు కొమ్మిడి వెంకట్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. బక్కని మాట్లాడుతూ నేడు తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో టీఎ్‌సపీఎస్సీ చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని, ఈ కేసులో బీఆర్‌ఎస్‌ పెద్దల హస్తముందన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ యాదయ్యగౌడ్‌, నాయకులు భిక్షపతియాదవ్‌, వెంకటేష్‌ ముదిరాజ్‌, తదితరులున్నారు. అదేవిధంగా ప్రతీపల్లెకు టీడీపీని తీసుకుపోదామని బక్కని అన్నారు. షాబాద్‌ మండల కేంద్రంలోని ముదిరాజ్‌ భవన్‌లో పార్టీ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు మూడుకరాల భూమి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను సైతం లాగేసుకుంటున్నారని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. పార్టీ చేవెళ్ల నియోజకవర్గ పరిశీలకులు సుభా్‌షయాదవ్‌, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మండల కన్వీనర్‌ పోచయ్య, మాజీ జడ్పీటీసీ పుష్ప, నాయకులు వెంకటయ్య, మహేందర్‌, తదితరులున్నారు.

Updated Date - 2023-03-26T00:04:53+05:30 IST