వేతనాల పెంపుతో డీడీఎన్‌ఎస్‌ హర్షం

ABN , First Publish Date - 2023-05-31T23:59:23+05:30 IST

ధూప దీప నైవేద్య అర్చకుల(డీడీఎన్‌ఎస్‌) కు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షనీయం అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ అన్నారు.

వేతనాల పెంపుతో డీడీఎన్‌ఎస్‌ హర్షం
హర్షం వ్యక్తం చేస్తున్న అర్చకులు

కొడంగల్‌, మే 31: ధూప దీప నైవేద్య అర్చకుల(డీడీఎన్‌ఎస్‌) కు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షనీయం అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో బ్రహ్మణ సంక్షేమ సదన్‌ ప్రారంభించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ డీడీఎన్‌ఎస్‌ అర్చకుల వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారన్నారు. అర్చకులకు రూ.22,500 వేతనమివ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఎం కేసీఆర్‌ రూ.10వేలకు పెంచుతున్నట్టు ప్రకటించినా ఆశించిన స్థాయిలో పెంచకపోవడం కొంత ఆవేదనగా ఉందన్నారు. కార్యక్రమంలో డీడీఎన్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జయతీర్థచారి, సభ్యులు కిట్టు స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:59:23+05:30 IST