వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

ABN , First Publish Date - 2023-07-21T00:55:04+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ కార్యదర్శి మర్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో తుర్క యాంజాల్‌ మున్సిపాలిటీ కోహెడ గ్రామానికి చెందిన లారీ ఓనర్స్‌ సంక్షేమ సంఘానికి సంబంధించిన వంద మంది సభ్యులు మర్రి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

ఆదిభట్ల, జూలై 20 : వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ కార్యదర్శి మర్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో తుర్క యాంజాల్‌ మున్సిపాలిటీ కోహెడ గ్రామానికి చెందిన లారీ ఓనర్స్‌ సంక్షేమ సంఘానికి సంబంధించిన వంద మంది సభ్యులు మర్రి నిరంజన్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలకు చెందిన వ్యక్తుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్పితే మరేవీ పట్టడం లేదన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మూడుసార్లు ఎ మ్మెల్యేగా గెలిపించినా ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శంకర్‌ గౌడ్‌, నాయకులు జంగారెడ్డి, పాండు రంగారెడ్డి, కమలాకర్‌ రెడ్డి, లారీ ఓనర్స్‌ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:55:04+05:30 IST