వధూవరులకు సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం

ABN , First Publish Date - 2023-05-14T23:52:40+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి దంపతుల కూతురు మనీషారెడ్డి, హిమదీప్‌రెడ్డి వివాహం ఆదివారం శంషాబాద్‌లోని జీఎంఆర్‌(ఎయిర్‌పోర్టు) ఎరీనాలో వైభవంగా జరిగింది.

వధూవరులకు సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం
వధూవరులు మనీషారెడ్డి, హిమదీప్‌రెడ్డిలతో సీఎం కేసీఆర్‌, మంత్రి సబితారెడ్డి, తదితరులు

జీఎంఆర్‌ ఎరీనాలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూతురు వివాహ వేడుక

శంషాబాద్‌ రూరల్‌, మే 14(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి దంపతుల కూతురు మనీషారెడ్డి, హిమదీప్‌రెడ్డి వివాహం ఆదివారం శంషాబాద్‌లోని జీఎంఆర్‌(ఎయిర్‌పోర్టు) ఎరీనాలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌ హాజరై వధూవరులను ఆశీర్వదిం చారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌, సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మె ల్యేలు బాల్క సుమన్‌, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, కాలె యాదయ్య, ప్రకాష్‌గౌడ్‌, కృష్ణారావు, మహేష్‌రెడ్డి, దానం నాగేందర్‌గౌడ్‌, ఆరికెపూడి గాంధీ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కేవీపీ రాంచందర్‌రావు, వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు జానారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్గు మల్లేషం, శంభీపూర్‌ రాజు, మాజీ మంత్రులు డీకే అరుణ, ప్రసాద్‌, చంద్రశేఖర్‌, విజయసాయిరెడ్డి, ఏపీ మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Updated Date - 2023-05-14T23:52:40+05:30 IST