మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలి
ABN , First Publish Date - 2023-09-17T23:36:43+05:30 IST
మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల ప్రభాకర్గుప్త ఆధ్వర్యంలో ఆదివారం పరిగిలోని ఆమె స్వగృహంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

పరిగి, సెప్టెంబరు 17: మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల ప్రభాకర్గుప్త ఆధ్వర్యంలో ఆదివారం పరిగిలోని ఆమె స్వగృహంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి, పూడూరు జడ్పీటీసీలు బి.హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ఎం.ఆశోక్, ఏఎంసీ చైర్మన్ సురేందర్, పరిగి, ఎంపీపీలు అరవింద్రావు, మల్లేశం, మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్రెడ్డి, నాయకులు ప్రభాకర్, కావలి లక్ష్మి, వీరమణి పాల్గొన్నారు.
మోమిన్పేట్: మతసామరాస్యానికి ప్రతీక మట్టి వినాయక చవితి అని మండల రైతు బంధు కో ఆర్డినేటర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మండల కేంద్రంలోని సంగమేశ్వర ఆలయంలో ఆదివారం హిందూ బంధువులకు ఆయన మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
ఘట్కేసర్ రూరల్: మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఎ్సఎ్స ప్రోగ్రాం అఫీసర్ మల్లేష్ తెలిపారు. మండలంలోని వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో ఆదివారం ఎన్ఎ్సఎ్స కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎ్సఎ్స వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొడంగల్: కొడంగల్లోని ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఆదివారం శ్రీ అయ్యప్పస్వామి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా మట్టి వినాయకులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్యాదవ్, బుక్క విక్రం పాల్గొన్నారు.
కీసర రూరల్: పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలకు పూజించటం శ్రేయస్కరమని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు.నాగారం మున్సిపాలిటీ పరిధి ఆరు, ఎనిమిది వార్డుల్లో ఆదివారం మట్టి వినాయక ప్రతిమలను కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటయ్యతో కలిసి ప్రజలకు పంపిణీ చేశారు.