ఇంటి స్థలం విషయంలో ఇరువర్గాల ఘర్షణ
ABN , First Publish Date - 2023-07-08T00:06:05+05:30 IST
ఇంటి స్థలం విషయంలో ఇరు కుటుంబాలు గొడవ పడి కర్రలతో కొట్టుకోవడంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి.
కర్రలతో కొట్టుకున్న వైనం
ఇద్దరికి గాయాలు
బషీరాబాద్, జూలై 7: ఇంటి స్థలం విషయంలో ఇరు కుటుంబాలు గొడవ పడి కర్రలతో కొట్టుకోవడంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని నంద్యానాయక్ తండాలో చోటుచేసుకోగా శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తండాకు చెందిన రథోడ్ పాండ్యానాయక్, చౌహాన్కిషన్ కుటుంబాల మధ్య ఇంటి పక్కన ఖాళీస్థలం ఉంది. ఈ స్థలం విషయంలో కొంతకాలంగా గొడవ పడుతున్నారు. ఈనెల 5న మరోసారి ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పాండ్యానాయక్, చౌహాన్కిషన్లు ఇరువురు కర్రలతో దాడి చేసుకోవడంతో తల, ఒంటిపై గాయాలయ్యాయి. ఇరువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్ఐ వేణుగోపాల్గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా దివ్యాంగుడినని చూడకుండా తనపై దాడి చేసిన చౌహాన్ కిషన్పై ఆదేరోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించాడు.