చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ నాకే
ABN , First Publish Date - 2023-06-18T23:39:03+05:30 IST
వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, సీంఎం కేసీఆర్ ఆశీర్వాదం తనకు ఎల్లవేళలా ఉంటుందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు.
పల్లెపల్లెకు రత్నం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
చేవెళ్ల, జూన్ 18 : వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, సీంఎం కేసీఆర్ ఆశీర్వాదం తనకు ఎల్లవేళలా ఉంటుందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దేవునిఎర్రవల్లి, రేగడిఘనాపూర్ తదితర గ్రామాల్లో పల్లెపల్లెకు రత్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ వస్తుందని స్పష్టం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి నాటి నుంచి నేటి వరకు చేవెళ్ల గడ్డపై స్వచ్ఛమైన రాజకీయ పాలన అందించామన్నారు. ఎక్కడ కూడా ఇంచు స్థలం కబ్జా చేయలేదన్నారు. అవినీతి రహిత పాలన ప్రజలకు అందించడం జరిగిందన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయంగా జీర్ణించుకోలేకనే పార్టీలు మారుతున్నాడని చెప్పడం సిగ్గు చేటు అని అన్నారు. నా చరిత్ర చేవెళ్ల ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. తన రాజకీయ గురువు దివంగత ఇంద్రారెడ్డి అని చెప్పారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చేవెళ్ల గడ్డపై ప్రజలకు ప్రజాసేవ చేస్తానన్నారు. మాజీ సర్పంచ్లు రాంచంద్రయ్యగౌడ్, వెంకట్రెడ్డి, రాంరెడ్డి, సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి, రవీందర్, రఘువీర్రెడ్డి, విష్ణువర్థన్రెడ్డి, మహేందర్రెడ్డి, ప్రభాకర్, హన్మంతు, లింగం, సుదర్శన్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.