ప్రశాంతంగా జేఎల్ఎం పరీక్ష
ABN , First Publish Date - 2023-05-01T00:05:40+05:30 IST
మండలంలో జూనియర్ లైన్మన్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 30: మండలంలో జూనియర్ లైన్మన్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పోలీసుస్టేషన్ పరిధి అంకుషాపూర్ ఏస్ ఇంజనీరింగ్ కళాశాలలో 700 మందికి గాను 597, వెంకటాపూర్ అనురాగ్ యునివర్సిటీలో 2500మందికి గాను 2117, చౌదరిగూడ నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 1000 మందికి గానూ 843 మంది అభ్యర్థులు జేఎల్ఎం పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి ఏసీపీ నరే్షరెడ్డి, సీఐ అశోక్రెడ్డి తనిఖీలు చేశారు.