కొర్విచెడ్ఘనిలోని రెండిళ్లలో చోరీ
ABN , First Publish Date - 2023-03-25T23:20:59+05:30 IST
కొర్విచెడ్ఘని గ్రామంలో శుక్రవారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ కిషన్ రాత్రి 10గంటల సమయంలో తన గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు.
బషీరాబాద్, మార్చి 25: కొర్విచెడ్ఘని గ్రామంలో శుక్రవారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ కిషన్ రాత్రి 10గంటల సమయంలో తన గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు. ఉదయం లేచి చూడగా ఇంటి తాళం విరగ్గొట్టి కనిపించింది. ఇంట్లోని బీరువా లాకర్ తాళం తొలగించి అందులో ఉన్న అరతులం బంగారు పుస్తెలు, అరతులం చైను, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అదే రోజు రాత్రి మరోఇంట్లో చౌహాన్ మోతిలాల్ తన ఇంటికి తాళం వేసి పక్కింటివారి ఇంటి స్లాబ్పై పడుకున్నారు. ఉదయం ఇంటికి రాగా తాళం విరగ్గొట్టి కనిపించగా ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచి పెట్టిన రూ.8వేల నగదు కనిపించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి ఘటనాస్థలాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.