భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2023-05-31T23:39:30+05:30 IST
మండల పరిధిలోని కాకునూర్, వేముల్నర్వ గ్రామాలలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కేశంపేట, మే 31: మండల పరిధిలోని కాకునూర్, వేముల్నర్వ గ్రామాలలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు గండ్ర లక్ష్మమ్మ, మంజుల మల్లేష్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజలు, అభిషేకాలు కొనసాగాయి. బొడ్రాయి ప్రతిష్ఠాపన అనంతరం ఆలయం వద్దకు మహిళలు బోనాలతో తరలివచ్చారు. కార్యక్రమాలలో ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, గౌడ సంఘం అధ్యక్షుడు వన్నవడ మల్లేష్ గౌడ్ దంపతులు, జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్రెడ్డి, వైస్ ఎంపీపీ అనురాధ పర్వత్రెడ్డి, నవీన్ కుమార్, కృష్ణయ్య తాండ్ర విష్ణువర్ధన్రెడ్డి, తోట ఆంజనేయులు, శ్రీశైలంగౌడ్, తైద పర్వతాలు, గాండ్ల జ్యోతి, మల్లేష్ యాదవ్, రమాదేవికోటేశ్వర్, గండ్ర జగదీశ్వర్గౌడ్, పల్లె నర్సింగ్రావు, రమేష్ గౌడ్, సతీష్ గౌడ్, భూపాల్ రెడ్డి, జంగారెడ్డి, జమాల్ఖాన్, అల్వాల శేఖర్, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.