భాస్కర యోగికి సాహిత్య పురస్కారం

ABN , First Publish Date - 2023-02-15T00:43:39+05:30 IST

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథాలకు 2020కు గాను సాహిత్య పురస్కారాలను అందజేసింది.

భాస్కర యోగికి సాహిత్య పురస్కారం
పురస్కారం అందుకుంటున్న భాస్కర యోగి

పరిగి, ఫిబ్రవరి 14: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథాలకు 2020కు గాను సాహిత్య పురస్కారాలను అందజేసింది. పరిగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ పి.భాస్కరయోగి రచించిన ‘హిందువుల పండగలు’ అనే వచన గ్రంథానికి పురస్కారాన్ని మంగళవారం నగరంలోని తెలుగు విశ్వవిద్యాయంలో టీఎ్‌సపిఎస్‌ చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి విశ్వవిద్యాయలం ఉపాధ్యక్షుడు టి.కిషన్‌రావు, స్టేట్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు. భాస్కరయోగి మాట్లాడుతూ.. పురస్కారం లభించడంతో సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2023-02-15T00:43:40+05:30 IST