బాలాజీసింగ్కు ‘ఎమ్మెల్సీ’ ఇవ్వాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:33 PM
ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా ముం దుండి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలని మాజీ ఎంపీపీ అన్నేపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ దేవయ్యగౌడ్ కోరారు.
మాడ్గుల, డిసెంబరు 18 : ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా ముం దుండి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలని మాజీ ఎంపీపీ అన్నేపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ దేవయ్యగౌడ్ కోరారు. ఈమేరకు మాడ్గుల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహిచారు. వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బాలాజీసింగ్ విదేశాల నుంచి వచ్చితెలంగాణ కోసం కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్లు గుర్తుచేశారు. అదే విధంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారయణరెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్సీగా బాలాజీ సింగ్కు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రస్థాయి నాయకత్వం ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో నిరంజన్గౌడ్, జెల్ల చంద్రయ్యగౌడ్ ఉన్నారు.