ఆలయ ప్రవేశం ఘర్షణలో సర్పంచ్, 35 మందిపై అట్రాసిటీ కేసు నమోదు
ABN , First Publish Date - 2023-06-02T23:48:36+05:30 IST
మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు.
దోమ, జూన్ 2: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్ఐ విశ్వజాన్ తెలిపారు. సర్పంచ్తో పాటు ఐదుగురు మహిళలు, 29మందిపై కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషించుకోవడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు కక్షతో ఒకే వర్గంపై కేసులు నమోదు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.