ఆలయ ప్రవేశం ఘర్షణలో సర్పంచ్‌, 35 మందిపై అట్రాసిటీ కేసు నమోదు

ABN , First Publish Date - 2023-06-02T23:48:36+05:30 IST

మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్‌తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌ తెలిపారు.

ఆలయ ప్రవేశం ఘర్షణలో సర్పంచ్‌, 35 మందిపై అట్రాసిటీ కేసు నమోదు

దోమ, జూన్‌ 2: మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం ఘర్షణలో అధికార పార్టీ సర్పంచ్‌తో పాటు 35మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్‌ఐ విశ్వజాన్‌ తెలిపారు. సర్పంచ్‌తో పాటు ఐదుగురు మహిళలు, 29మందిపై కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషించుకోవడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు కక్షతో ఒకే వర్గంపై కేసులు నమోదు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-06-02T23:48:36+05:30 IST