రెండో విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-06-03T00:04:50+05:30 IST

రెండవ విడత గొర్రెల పంపిణీకి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు. ఎ

రెండో విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు : ఎమ్మెల్యే
ఆర్థికసాయం అందజేస్తున్న జైపాల్‌ యాదవ్‌

ఇబ్రహీంపట్నం, జూన్‌ 2: రెండవ విడత గొర్రెల పంపిణీకి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గొర్రెల పంపిణీపై ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో రూ.1.75 లక్షలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలును గొర్రెల పెంపకందారులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం రూ.1,31,250 సబ్సిడీగా అందజేస్తుందని లబ్ధిదారులు తమ వాటాగా రూ.43,150లు చెల్లించాలని సూచించారు. మొదటి విడతలో 2,445 యూనిట్లు లబ్ధిదారులు తీసుకున్నారని రెండవ విడతలో మిగిలిన 7,674 యూనిట్లు దశల వారీగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, తదితరులున్నారు.

Updated Date - 2023-06-03T00:04:50+05:30 IST