చేవెళ్ల బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నా
ABN , First Publish Date - 2023-06-02T23:38:42+05:30 IST
బీఆర్ఎస్ తరఫున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉందని, సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం
మొయినాబాద్ రూరల్, జూన్ 2 : బీఆర్ఎస్ తరఫున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉందని, సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. శుక్రవారం మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు. తొమ్మిదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను దేశానికే రోల్మోడల్గా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.