తాండూరుకు మరో బైపాస్
ABN , First Publish Date - 2023-06-02T23:31:18+05:30 IST
తాండూరు ప్రాంతానికి మరో బైపాస్ రోడ్డు రాబోతుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు.
తాండూరు, జూన్2 : తాండూరు ప్రాంతానికి మరో బైపాస్ రోడ్డు రాబోతుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రూ.2కోట్ల వ్యయంతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తాండూరునుంచి ఒకప్పుడు ఉన్న వలసలు పూర్తిగా తగ్గాయని, పొరుగున కర్ణాటక ప్రాంత వాసులు తాండూరుకు వ లస వచ్చి జీవనం సాగిస్తున్నారని అన్నారు. రాజుగౌడ్, స్వప్న, ఆర్డీవో, శంకర్నాయక్, శంకర్సింగ్, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.