యూత్కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అందె మోహన్
ABN , First Publish Date - 2023-07-21T00:57:43+05:30 IST
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షాద్నగర్కు చెందిన అందె మోహన్ను నియమిస్తూ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సురభి ద్వివేది, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలు గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
షాద్నగర్ అర్బన్, జూలై 20: యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షాద్నగర్కు చెందిన అందె మోహన్ను నియమిస్తూ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సురభి ద్వివేది, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలు గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న అందె మోహన్ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి, ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అందె మోహన్ తెలిపారు.