అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-06-03T00:03:25+05:30 IST
మండల పరిధి రంగాపూర్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి నందిగామ, కొత్తూరు మండలాల్లోని జేపీ దర్గా, రంగాపూర్, ఇన్ముల్నర్వ గ్రామాల్లో భిఇక్షాటన చేస్తూ ఉండేవాడు.
నందిగామ, జూన్ 2 : మండల పరిధి రంగాపూర్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి నందిగామ, కొత్తూరు మండలాల్లోని జేపీ దర్గా, రంగాపూర్, ఇన్ముల్నర్వ గ్రామాల్లో భిఇక్షాటన చేస్తూ ఉండేవాడు. శుక్రవారం రంగాపూర్ శివారులోని దర్గా రోడ్డులో రంగాపూర్కు చెందిన తోట యాదయ్య పొలం వద్ద ఆ వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యదర్శి మున్నూరు రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. వడదెబ్బతో మృతిచెందినట్లు వారు అనుమానిస్తున్నారు.