విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2023-08-22T23:35:04+05:30 IST

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఆరోగ్యశాఖ వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న జిల్లా వైద్యాఽధికారి వెంకేటేశ్వర్‌రావు

జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు

చేవెళ్ల, ఆగస్టు 22 : గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఆరోగ్యశాఖ వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ మండల పరిధిలోని చందనవెళ్లి తదితర సబ్‌ సెంటర్లలోని వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆరోగ్య ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యపరీక్షలు చేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటమన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్‌, అసంక్రమిత వ్యాధుల ఆరికట్టడం, టీబీని గుర్తించడం ఇతర ఆరోగ్య సేవల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల డిప్యూటి డీఎంహెచ్‌వో దామోదర్‌, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-22T23:35:04+05:30 IST