రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-06-02T23:47:32+05:30 IST

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 2: డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌ వైపు నుంచి రాంపల్లికి టైల్స్‌లోడుతో వెళ్తుతున్న అశోక్‌ లైల్యాండ్‌ మినీవ్యాన్‌ ఘట్‌కేసర్‌ బైపాస్‌లోని మైసమ్మగుట్ట సమీపంలో డివైడర్‌ను ఢీకొని పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ఉన్న సంజీవ్‌(45)కి తీవ్రరక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందగా మరో ముగ్గురు వికంద్‌రాయ్‌, సంతోష్‌కుమార్‌, సురేందర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్‌ పవన్‌కుమార్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-06-02T23:47:32+05:30 IST