కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-02-07T00:07:02+05:30 IST
కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధి ఘట్కేసర్ పట్టణంలో చోటుచేసుకుంది.
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 6 : కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధి ఘట్కేసర్ పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన నీల నర్సింహ(40) భార్య శారద, ముగ్గురు పిల్లలతో కలిసి ఘట్కేసర్ పట్టణంలో నివాసముంటూ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి నర్సింహకు కడుపునొప్పి రావడంతో విశ్రాంతి తీసుకుంటానని భార్యకు చెప్పి గదిలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భార్య గదిలోకి వెళ్ళి చూసేసరికినర్సింహ చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దించి, పరిసరాలను పరిశీలించి, పోస్టుమార్టం గాంధీకి తరలించారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామం తరలించినట్లు నర్సింహ కుటుంబసభ్యులు తెలిపారు.