విద్యుదాఘాతంతో దివ్యాంగ రైతు మృతి
ABN , First Publish Date - 2023-03-25T22:59:58+05:30 IST
మండల పరిధి పెంజర్లలో పల్గుట్ట బాల్రాజ్ అలియాస్ పరేషా(47) అనే దివ్యాంగ రైతు శనివారం ఉదయం పొలం వద్ద విద్యుత్ షాక్తో మృతిచెందినట్లు ఎస్సై సయీద్ తెలిపారు.
కొత్తూర్, మార్చి 25: మండల పరిధి పెంజర్లలో పల్గుట్ట బాల్రాజ్ అలియాస్ పరేషా(47) అనే దివ్యాంగ రైతు శనివారం ఉదయం పొలం వద్ద విద్యుత్ షాక్తో మృతిచెందినట్లు ఎస్సై సయీద్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బాల్రాజ్ తన పొలంలోని బోరు వద్దకు వెళ్తుండగా అప్పటికే పందుల కోసం వేసిన విద్యుత్ కంచెకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. బాల్రాజ్కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. రైతు భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.