రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2023-02-06T23:26:28+05:30 IST

మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తాడ్వాయి,ఫిబ్రవరి 6: మండలంలోని క్రిష్ణాజీవాడి గ్రామశివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(55) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. లక్ష్మీపతి నిత్యంలాగే వడ్రంగి పని చేయడం కోసం బ్రహ్మాజీవాడి గ్రామానికి వెళ్లాడు. పనిముగించుకుని రాత్రి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో లింగంపేట మండలం ఒంటరిపల్లి గ్రామానికి చెందిన చెరుకు ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయమై మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరుకుమారులు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:26:30+05:30 IST