మంచి మార్గాన్ని చూపిన వారే దేవుళ్లు
ABN , First Publish Date - 2023-01-24T00:49:56+05:30 IST
మంచి మార్గాన్ని చూపించిన వారే దేవుళ్లన్నారు.బంజారాల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని వచ్చిన గురువు రాంరావు మహరాజ్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండ లంలోని అంకోల్ తండాలో సోమవారం బంజారుల గురు వు, ఆరాధ్య దైవం రాంరావు మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాప నలో పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్, జనవరి 23 : మంచి మార్గాన్ని చూపించిన వారే దేవుళ్లన్నారు.బంజారాల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని వచ్చిన గురువు రాంరావు మహరాజ్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండ లంలోని అంకోల్ తండాలో సోమవారం బంజారుల గురు వు, ఆరాధ్య దైవం రాంరావు మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాప నలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాం రావు మహరాజ్ గిరిజనుల జీవితాల్లో వెలుగులు తీసుకుని వచ్చారన్నారు. సన్మార్గం, సంప్రదాయాలను గుర్తుచేస్తూ బోధనలు చేశారన్నారు. మహరాజ్ ద్వారా గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. జగదాం బ మాత, సేవాలాల్ మహరాజ్ల మందిరాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. యువకులు, తం డా వాసులు రాంరావు మహరాజ్ బోధనలతో ముం దుకెళ్లాల న్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్య, బం జారా నాయకుడు బద్యానాయక్, ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీటీసీ జన్నుబా యి ప్రతాప్ సింగ్, సాయిలు యాదవ్, తహ సీల్దార్ బావయ్య, ఎం పీడీవో సుబ్ర హ్మ ణ్యం, ఆయా గ్రామాల స ర్పంచులు, గి రిజన నా యకులు, యువ కులు తదితరులు పాల్గొన్నారు.