బొలేరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-02-06T23:25:40+05:30 IST
బొలేరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాన్సువాడ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
బాన్సువాడ, ఫిబ్రవరి 6 : బొలేరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాన్సువాడ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కారేగాం గ్రామానికి చెందిన మేతరి అంజయ్య (36) ద్విచక్ర వాహనంపై పిట్లం వెళుతుండగా బాన్సువాడ మండలం జుక్కల్ దాని తండా వద్ద బొలేరో వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.