కార్మికుల హక్కులను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2023-07-20T00:25:09+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారానే కాపాడుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు.

  కార్మికుల హక్కులను కాపాడుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు ఐక్య ఉద్యమాల ద్వారానే కాపాడుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం గుట్టలో రెండు రోజుల పాటు జరిగిన సీఐటీయూ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం ముగింపు సమాశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం రాకముందు నాటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకంగా ఉన్న నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకవచ్చిందని అన్నారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు.

Updated Date - 2023-07-20T00:25:09+05:30 IST