కాంగ్రెస్తోనే తెలంగాణ పురోగతి సాధ్యం
ABN , First Publish Date - 2023-06-03T00:21:59+05:30 IST
కాంగ్రె్స పార్టీ అధికారం లోకి వస్తేనే తెలంగాణ పురోగ తి సాధ్యమని డీసీసీ అధ్యక్షు డు కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవా రం భువనగిరిలో ఏఐసీసీ నేత సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు.
డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి
భువనగిరి టౌన్, జూన్ 2: కాంగ్రె్స పార్టీ అధికారం లోకి వస్తేనే తెలంగాణ పురోగ తి సాధ్యమని డీసీసీ అధ్యక్షు డు కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవా రం భువనగిరిలో ఏఐసీసీ నేత సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తన కుటుంబ ఆస్తిగా పరిగణిస్తూ రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్వార్థ వైఖరితోనే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్తో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. కార్యక్రమాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్కుమార్, మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.