విద్యార్థులు అమరవీరుల ఆశయాలను సాధించాలి
ABN , First Publish Date - 2023-02-07T00:47:20+05:30 IST
విద్యార్థులు అమరవీరుల ఆశయాలను సాధించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
సూర్యాపేట అర్బన, ఫిబ్రవరి 6 : విద్యార్థులు అమరవీరుల ఆశయాలను సాధించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజీరింగ్ కళాశాలలో నిర్వహించిన పరవమీర వందన సమర్పణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలను, జీవితాలను ప్రేరణగా తీసుకుని స్వీయనియంత్రణ, ఉన్నత విలువలతో విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. భారత ప్రాచీన సాంప్రదాయాలు, వాటి విలువలు ప్రపంచమంతా చాటాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చంద్రశేఖర్, డైరెక్టర్ కిరణ్కుమార్, నాగరాజు, ప్రిన్సిపల్ ముత్యంరాజు పాల్గొన్నారు.