పథకాలను సమర్థంగా అమలుచేయాలి
ABN , First Publish Date - 2023-02-02T00:19:39+05:30 IST
ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయాలని కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పేర్కొన్నారు.
ఆత్మకూర్(ఎస్), ఫిబ్రవరి 1: ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయాలని కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేసిన నిధులతో చేపట్టిన పనులను కేంద్ర పరిశీలన బృందం బుధవారం మండల పరిధిలోని ముక్కుడు దేవులపల్లి గ్రామంలో తనిఖీ చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం, ఇందిర క్రాంతి పథకం, పంచాయతీరాజ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను బృందం సభ్యులు పరిశీలించారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, స్వయం సహాయక సంఘాల పనితీరు, సడక్ యోజన, వాటర్ షెడ్ పనులను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో వందశాతం అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో నేషనల్ లెవెల్ మానెటరింగ్ బృందం సభ్యుడు నిరంజన్రెడ్డి, శాంతికుమార్, అదనపు డీఆర్డీవో సంజీవరావు, ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎంపీవో సంజీవ, ఎంఈవో ధారసింగ్, పీఆర్ఏఈ బాబురావు, తదితరులు పాల్గొన్నారు.