ఆధ్యాత్మికం, సంప్రదాయాల్లో మన దేశానిది ప్రథమస్థానం
ABN , First Publish Date - 2023-09-20T00:23:41+05:30 IST
ఆధ్యాత్మికం, సంస్కృతి, సంప్రదాయాల్లో మన దేశం ప్రథమస్థానంలో ఉందని ఎమ్మెల్సీ, మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవి అన్నారు. మంగళవారం దేవరకొండలో పీవీ సన్నిహితుడు దివంగత నెమికంటి సోమన్న రాసిన ‘శ్రీగజానన విజయం’ పుస్తకాన్ని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి ఆవిష్కరించారు.

ఎమ్మెల్సీ వాణిదేవి
దేవరకొండ, సెప్టెంబరు 19: ఆధ్యాత్మికం, సంస్కృతి, సంప్రదాయాల్లో మన దేశం ప్రథమస్థానంలో ఉందని ఎమ్మెల్సీ, మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవి అన్నారు. మంగళవారం దేవరకొండలో పీవీ సన్నిహితుడు దివంగత నెమికంటి సోమన్న రాసిన ‘శ్రీగజానన విజయం’ పుస్తకాన్ని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మరాఠి భాషలో ఉన్న పుస్తకాన్ని నేమికంటి సోమన్న తెలుగులో అనువాదం చేయగా, ఆ యన కుమారుడు నేమికంటి గౌరిశంకర్, రమాశంకర్, ఉమాశంకర్, అంబశంకర్ దాన్ని విడుదల చేయడం అభినందనీయమన్నారు. కవు లు, కళాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. మహిళ లు చదువులో రాణించి అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, నీల పాండరయ్య, పానగంటి మల్లయ్య, పొలిశెట్టి భిక్షపతి, నీల బుచ్చయ్య, ఉమామహేశ్వర్, శేఖర్, కోటయ్య పాల్గొన్నారు.