రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేసి్త్ర మృతి
ABN , First Publish Date - 2023-06-07T00:41:11+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుతారి మేసి్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు.
హుజూర్నగర్ రూరల్, జూన్ 6: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుతారి మేసి్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గోవిందాపురానికి చెందిన కందుల గోపయ్య(40) గత నెల 21న మట్టపల్లిలో సుతారి పని ముగించుకుని హుజూర్నగర్కు స్కూటీపై తిరిగి వస్తుండగా యర్రగట్టు గ్రామం వద్ద గేదెలు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయం కావడంతో, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మంలోని మమత ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ నెల ఐదో తేదీన ఇంటికి రాగా, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కటుంబ సభ్యులు అతడిని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గోపయ్య భార్య దేవమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గం పాల్గొన్నా