గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు : ఎమ్మెల్యే కిషోర్‌

ABN , First Publish Date - 2023-05-15T00:08:14+05:30 IST

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు : ఎమ్మెల్యే కిషోర్‌
మోత్కూరులో గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌

మోత్కూరు, మే 14: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మోత్కూరు గ్రంథాలయంలో ఆదనపు హాల్‌ నిర్మాణానికి రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి తమ సంస్థ నుంచి రూ.పది లక్షలు మంజూరు చేయించగా, ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. నిత్యం గ్రంథాలయానికి వెళ్లడం ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని రకాలు విశేషాలు అవగతమవుతాయన్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమమేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు

దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండలంలోని అనాజిపురంలో నిర్వహిస్తున్న అభయాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం అభయాంజనేయ స్వామి, గణపతి విగ్రహ, ధ్వజస్థంభ, యంత్ర ప్రతిష్ట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మోత్కూరు మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి, సర్పంచ్‌ ఉప్పల లక్ష్మమ్మయాదయ్య, సింగిల్‌విండో, మార్కెట్‌ చైర్మన్లు కంచర్ల అశోక్‌రెడ్డి, కొణతం యాకూబ్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, పొన్నెబోయిన రమేష్‌, కౌన్సిలర్‌ బొడ్డుపల్లి కళ్యాణ్‌చక్రవర్తి, దేవేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, కమిషనర్‌ సి.శ్రీకాంత్‌, కోఆప్షన్‌ సభ్యులు గనగాని నర్సింహ, ఆనందమ్మస్వామిరాయుడు, ఎండీ. సుల్తానమజీద్‌, మాజీ సర్పంచ్‌ బయ్యని పిచ్చయ్య, గ్రంథాలయ చైర్మన్‌ కోమటి మత్స్యగిరి, చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, పొడిచేడు సర్పంచ్‌ పేలపూడి మధు, పేలపూడి వెంకటేశ్వర్లు, కొండ సోంమల్లు పాల్గొన్నారు.

వివాహానికి ఆర్థిక సాయం

మోత్కూరు మండలం పోడిచేడు గ్రామానికి చెందిన గిన్నాల కనకచారి కూతూరు స్వాతి వివాహానికి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కాశోజు శంకరమ్మను అమ్మాయి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకొని ఆర్థిక సాయం చేశారు.

కంఠమహేశ్వరుని ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

అడ్డగూడూరు: మండలంలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో నిర్వహించిన కంఠమహేశ్వరుని ఉత్సవాల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నారగోని అంజ య్యగౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, చిప్పలపల్లి మహేందర్‌నాథ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీరాముల అయోధ్య, చౌగోని సత్యంగౌడ్‌, ఎంపీటీసీ చిగుల్ల ఉపేంద్ర ఉన్నారు.

Updated Date - 2023-05-15T00:08:14+05:30 IST