కందులు క్వింటా రూ.10,994
ABN , First Publish Date - 2023-09-05T01:22:58+05:30 IST
సూ ర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటా కం దులకు అత్యధికంగా రూ.10,994లు పలికింది. మద్దతు ధర రూ.7వేలు ఉండగా మద్దతు ధర కు మించి అధికంగా రూ.3,994లు వచ్చింది. ఈ సీజన్లో కందులకు మార్కెట్లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు.
సూర్యాపేట సిటీ, సెప్టెంబరు 4: సూ ర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటా కం దులకు అత్యధికంగా రూ.10,994లు పలికింది. మద్దతు ధర రూ.7వేలు ఉండగా మద్దతు ధర కు మించి అధికంగా రూ.3,994లు వచ్చింది. ఈ సీజన్లో కందులకు మార్కెట్లో ఈ స్థాయిలో ధర రావడం ఇదే మొదటిసారని వ్యాపారులు తెలిపారు. మార్కెట్కు సోమవా రం 11మంది రైతులు 51 బస్తాల కందులను తీసుకువచ్చారు. వారిలో ఆత్మకూర్(ఎస్) మం డలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన రైతు ముర్రు లక్ష్మణ్రావు ఆరు బస్తాల కందులకు అత్యధిక ధర రూ.10,994లు ధర వచ్చింది. మిగిలిన 10మంది రైతులకు రూ.9వేల నుంచి రూ. 10,472లు లోపు ధరలు వచ్చాయి. ఈ నెల 25వ తేదీన పేట మార్కెట్కు 20 బస్తాల కందులు రాగా వాటికి ఎక్కువ ధర రూ. 10,454లు, తక్కువ ధర కూడా అదే ధర వచ్చింది. కంది ఉత్పత్తి తక్కువగా ఉండటంతో కంది ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ కార్యదర్శి ఎండీ. ఫసియూద్ధీన్ తెలిపారు.