జన చైతన్యయాత్రను విజయంతం చేయాలి

ABN , First Publish Date - 2023-03-25T23:54:44+05:30 IST

: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన చైతన్య యాత్రలను విజయంతం చేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు.

జన చైతన్యయాత్రను విజయంతం చేయాలి
భువనగిరిలో సీపీఎం కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీతారాములు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు

భువనగిరి టౌన్‌, మార్చి 28: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన చైతన్య యాత్రలను విజయంతం చేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు. భువనగిరిలో నిర్మిస్తున్న సీపీఎం జిల్లా కార్యాలయ పనులను శనివారం పరిశీలించి మాట్లాడారు. ప్రజలను చైతన్య పర్చేందుకు జన చైతన్యయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఎం కార్యాలయాలు పౌర సేవా కేంద్రాల లాంటివని ఆయ న అన్నారు. మరో సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్‌ మాట్లాడు తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని వేధించే లక్ష్యంతోనే ఆయనపై బీజేపీ ప్రభు త్వం ఎంపీగా అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. పార్టీ పట్టణ శాఖ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు భట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ ఈ నెల 28న జన చైతన్య యాత్ర భువనగిరికి రానున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-03-25T23:54:44+05:30 IST