పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: సీపీఐ
ABN , First Publish Date - 2023-03-25T23:16:57+05:30 IST
ప్రభుత్వ ఖాళీ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి అంబటి నాగయ్య కోరారు.
నేరేడుచర్ల, మార్చి 25: ప్రభుత్వ ఖాళీ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి అంబటి నాగయ్య కోరారు. 27రోజులుగా ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న నిరుపేదలకు శనివారం మద్దతు తెలిపి, మాట్లాడారు. పలు దఫాలుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అనంతరం నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో ప్రధానకూడలిలో వంటావార్పు నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. కార్యక్రమంలో వాసా పల్లయ్య, వాసా కరుణాకర్, సయ్యద్ హుస్సేన్, తాళ్లూరు లక్ష్మయ్య, కుమ్మరి లక్ష్మమ్మ, రంగయ్య, రెహమాన్, బేగం, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.