కన్నుల పండువగా కృష్ణమ్మకు హారతి

ABN , First Publish Date - 2023-06-03T00:32:31+05:30 IST

మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కృష్ణమ్మకు హారతి కార్యక్రమా న్ని వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా కృష్ణమ్మకు హారతి
కృష్ణమ్మకు హారతి ఇస్తున్న వేదపండితులు

మఠంపల్లి, జూన 2 : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కృష్ణమ్మకు హారతి కార్యక్రమా న్ని వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం కృష్ణమ్మకు హారతి కార్యక్రమా న్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం క్షేత్రంలో ఉదయం భక్తవత్సలుడికి నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపించారు. ఆ తర్వాత ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు పూర్తయ్యా క, హోమాధికాలను భక్తిశ్రద్ధలతో చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు పుణ్యాహవాచనం అనంతరం కల్యాణోత్సవంలో మాంగళ్యధారణ, తలంబ్రాలు, గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్యాలు కొనసాగా యి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సా యంత్రం ఐదు గంటలకు కృష్ణమ్మకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈ వో సిరికొండ నవీన, కంబాల శ్రీనివాస్‌, ఆలయ అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:32:31+05:30 IST