రోడ్డు ప్రమాదంలో తాతామనుమడు మృతి

ABN , First Publish Date - 2023-02-21T00:31:09+05:30 IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసకు తాత, మనుమడు మృతి చెం దారు. రామాంజనేయతండాకు లకావత చిన్న బాలు(50) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో తాతామనుమడు మృతి
చిన్నబాలు, గోపీచంద్‌(ఫైల్‌ఫొటోలు)

కోదాడ రూరల్‌, ఫిబ్రవరి 20 : సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుసకు తాత, మనుమడు మృతి చెం దారు. రామాంజనేయతండాకు లకావత చిన్న బాలు(50) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొలానికి నీళ్లు పెట్టేందుకు సోమవారం గ్రామా నికి చెందిన వరుసకు మనుమడైన లకావత గోపీచంద్‌(14)తో కలిసి ద్విచక్ర వాహనంపై దొండపాడు వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదు రుగా దొండపాడు నుంచి కోదాడ వైపు వస్తున్న సిమెంట్‌ లారీ ఢీకొట్టింది. దీంతో చిన్నబాలు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలైన లకావత గోపీచంద్‌ను కోదాడ ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మనుమడు కూడా మృతిచెందాడు. చిన్నబాలు భార్య రజిత ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత తెలిపారు.

Updated Date - 2023-02-21T00:31:15+05:30 IST