రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , First Publish Date - 2023-06-15T00:04:01+05:30 IST
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు.
హుజూర్నగర్ రూరల్, నేరేడుచర్ల, జూన్ 14: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని శ్రీనివాసపురంలో రూ.68 లక్షలతో నిర్మిస్తున్న 1000మెట్రిక్ టన్నుల గోదాంకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా లక్కవరంలో రూ.38లక్షలతో నిర్మించిన 500మెట్రిక్ టన్నుల గోదాం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గోదాంలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లింగగిరి పీఏసీఎస్ ఛైర్మన్ కట్టా గోపాల్రావుచౌదరి, ఎంపీపీ శ్రీను, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, రమ్యనాగరాజు, విజయలక్ష్మి, కాశమ్మ, సౌజన్యనరేష్, వీరస్వామి, సీఈదో జనార్దన పాల్గొన్నారు.
- హుజూర్నగర్ మండలంలోని కరక్కాయలగూడెంలో రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కీతా జయమ్మ, ధనమూర్తి, కృష్ణమోహన్, కె.సైదిరెడ్డి, మల్లేపల్లి వీరబాబు, అప్పారావు పాల్గొన్నారు.
- అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలంలోని పెంచికల్దిన్న గ్రామంలో పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకుంఠపురంలో ఉపాధిహామీ నిధులు రూ.20లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. సోమారం గ్రామంలో కాటమయ్య స్వామి ఐదో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, అరిబండి సురేష్, అమృతారెడ్డి, నాగరాజు, వాణి, ఉమ తదితరులు పాల్గొన్నారు.