వడదెబ్బతో రైతు మృతి
ABN , First Publish Date - 2023-06-03T00:35:32+05:30 IST
వడదెబ్బతో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో ఓ రైతు మృతిచెందాడు.
పెద్దవూర, జూన 2: వడదెబ్బతో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో ఓ రైతు మృతిచెందాడు. ఎస్ఐ పరమేష్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నీమానాయక్తండాకు చెందిన రమావత బాలు(33) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతుండటంతో భార్య సునీత ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు. బాలుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.